తెలంగాణ

telangana

By

Published : May 30, 2020, 3:45 PM IST

ETV Bharat / business

డిష్​టీవీలో ఎస్​​ బ్యాంక్ 24 శాతం వాటా స్వాధీనం

డిష్​టీవీ ఇండియా లిమిటెడ్​లో 24.19 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది ఎస్ బ్యాంక్. దీనితో మొత్తం 44.53 కోట్ల ఈక్విటీ షేర్లు ఎస్​ బ్యాంక్ సొంతం అయ్యాయి. ఒక్కో షేరును నామమాత్రపు ధర రూ.1కి దక్కించుకోవడం గమనార్హం.

Yes Bank acquires 24.19 pc stake in Dish TV India with invocation of pledged shares
డిష్​ టీవీలో ఎస్​​ బ్యాంక్ 24 శాతం వాటా స్వాధీనం

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​ బ్యాంక్.. డీటీహెచ్ సేవల సంస్థ డిష్​టీవీ ఇండియా లిమిటెడ్​ నుంచి 44.53 కోట్ల ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకుంది. డిష్​టీవీలో ఈ మొత్తం షేర్ల వాటా 24.19 శాతానికి సమానం. ఒక్కో షేరును నామమాత్రపు ధర రూ.1తో దక్కించుకుంది ఎస్​ బ్యాంక్.

ఎస్​​ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన కొన్ని సంస్థలు క్రెడిట్​ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలకు డిష్​ టీవీలో ఉన్న వాటాలను ఎస్​ బ్యాంకు ఒకేసారి స్వాధీనం చేసుకుంది.

డిష్​టీవీ ఇండియా లిమిటెడ్

డిష్​టీవీ... డైరెక్ట్ హోమ్ ఎంటర్​టైన్​మెంట్ సర్వీస్ ప్రొవైడర్. ఈ కంపెనీ బ్యాండ్​విడ్త్ సామర్థ్యం 1,422 ఎంహెచ్​జెడ్. ఈ కంపెనీకి 40 ఆడియో ఛానళ్లు, 70 హెచ్​డీ ఛానళ్లు సహా 655 ఛానళ్లు ఉన్నాయి.

డిష్​టీవీ 2019 మార్చి 31 నాటికి రూ.6,218.28 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి డిష్​టీవీ ఇండియాను జీ గ్రూప్​, వీడియోకాన్ గ్రూప్​లు నిర్వహిస్తున్నాయి.

ఇదీ చూడండి:మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

ABOUT THE AUTHOR

...view details