తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2020, 10:21 AM IST

ETV Bharat / business

షియోమీ 150ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్​.. విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షియోమీ.. తన మొబైల్​ శ్రేణిలో సరికొత్త మోడల్​ను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Xiaomi to launch 150MP camera smartphone in Q4 2020
షియోమీ 150ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్​

చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం షియోమీ 150 ఎంపీ కెమెరాతో కూడిన స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్త ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేసే యోచనలో ఉంది షియోమీ.

షియో​మీ సంస్థ 2019లో 48 ఎంపీ కెమెరా, 64 ఎంపీ సెన్సార్​తో రెడ్​మీ నోట్​-8ప్రో ఫోన్​ను ప్రారంభించింది. అదే ఏడాది 108 ఎంపీ సెన్సార్​తో కూడిన సీసీ9 ప్రోను కూడా తీసుకొచ్చింది. తాజాగా 150 ఎంపీ కెమెరా ఫీచర్​తో మరో కొత్త మోడల్​ను​ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

పోటీలో శాంసంగ్..

ఇదిలా ఉండగా శాంసంగ్​ ఇప్పటికే 250 మెగా పిక్సెల్​ కెమెరా సెన్సార్​ ఫోన్​ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వీటన్నిటికీ మించి 600 ఎంపీ రిజల్యూషన్​తో కూడిన సెన్సార్​పై కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ దక్షిణ కొరియా దిగ్గజం. పోటీని తట్టుకునేందుకే షియో​మీ కొత్త మోడల్​ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇదే తరహా ఫీచర్లతో ఒప్పో, వివో కంపెనీలు 2021 మొదటి త్రైమాసికంలో తమ ఫోన్​లను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:వాట్సాప్‌లో జియోమార్ట్​ సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details