తెలంగాణ

telangana

ETV Bharat / business

కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంపై సెప్టెంబర్​ నెలకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. టోకు ద్రవ్యోల్బణం 0.33 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.

By

Published : Oct 14, 2019, 1:10 PM IST

కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం

ఆహారేతర పదార్థాల ధరల్లో తగ్గుదలతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత సెప్టెంబర్​ నెలలో 0.33 శాతంగా నమోదైంది. ఈమేరకు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. ఆగస్టులో ఇది 1.08 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

టోకు ధరల ఆధారిత వార్షిక ద్రవ్యోల్బణం 2018 సెప్టెంబర్​లో 5.22 శాతంగా నమోదైంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో 7.47 శాతంగా ఉంది. ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 2.18శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.

ABOUT THE AUTHOR

...view details