తెలంగాణ

telangana

ETV Bharat / business

విప్రో సీఈఓ వేతనం@రూ.64 కోట్లు - విప్రో న్యూస్ ఆన్​లైన్

2020-21 ఆర్థిక సంవత్సరంలో విప్రో సీఈఓ, ఎండీ థియరీ డెలాపోర్ట్ రూ.64.3 కోట్ల పారితోషికం అందుకున్నారు. 2020 జూలై 6-2021 మార్చి 31 మధ్య కాలానికి గాను ఈ మొత్తం అందినట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది.

wipro
విప్రో

By

Published : Jun 11, 2021, 6:13 AM IST

Updated : Jun 11, 2021, 9:36 AM IST

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ 2020-21లో రూ.64.3 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. జూలై 6, 2020-మార్చి 31 2021 మధ్య లెక్కించే ఈ మొత్తంలో.. వన్-టైమ్ క్యాష్ అవార్డు, వార్షిక స్టాక్ గ్రాంట్, ఆర్‌ఎస్‌యూల రూపంలో అందుకున్నట్లు వెల్లడించింది.

భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే సారథుల్లో విప్రో సీఈఓ ఒకరు. మాజీ కాప్​జెమినీ ఉద్యోగి అయిన డెలాపోర్ట్.. గతేడాది జూలై 6న విప్రో సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టారు.

ఇక 2020-21కి గాను ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ.49.68 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ 2020-21లో రూ 20.36 కోట్ల వేతన ప్యాకేజీని తీసుకున్నారు. మరోవైపు 2020 జూన్ 1న విప్రో సీఈఓ, ఎండీ పదవులకు రాజీనామా చేసిన అబిదాలీ నీముచ్‌వాలా 3,05,845 అమెరికన్ డాలర్లు పరిహారాన్ని అందించింది విప్రో.

ఇవీ చదవండి:టీసీఎస్​ సీఈఓ జీతం రూ.20.36 కోట్లు

విప్రోకు షాక్- సీఈఓ అబిదాలీ రాజీనామా

Last Updated : Jun 11, 2021, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details