సాంకేతిక సహకారంతో.. పట్టణాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి.. 95శాతంగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను వందశాతం పూర్తి చేసి ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతం)భారత్గా తీర్చిదిద్దుతామన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ తమకో అవకాశంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పట్టణ పేదల కోసం 81లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఇందుకోసం రూ.4.83లక్షల కోట్లు కేటాయింటినట్లు తెలిపారు. వీటిలో 24లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తై లబ్ధికారులకు పంపిణీ చేశామని ప్రకటించారు.
పట్టణీకరణ మాకో అవకాశం.. సవాల్ కాదు
వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ మాకు సమస్య కాదు ఛాలెంజ్.. సాంకేతిక సహకారంతో.. పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం.. నగరాలకు వలసలు నివారిస్తాం: నిర్మలా సీతారామన్
BUDGET