కరోనా వేళ మరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది సామాన్యుడి జీవితాన్ని చిందరవందర చేస్తుంది. తాజాగా డిసెంబర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.59శాతానికి పెరిగింది. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గత ఐదు నెలలతో పోలిస్తే ఇది ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని 4 వద్ద స్థిరీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాకపోతే ఆర్బీఐ పేర్కొన్న 2-6 శాతం మధ్యలోనే ఉండటం మాత్రమే ప్రభుత్వానికి ఊరట. మరోపక్క ముడి చమురు ధరలు మెల్లగా పీపాకు 100 డాలర్ల వద్దకు చేరుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో కేంద్రం కూడా ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ఉద్దేశంలో లేదు.
పెరుగుతున్న నిరుద్యోగం..
దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కొన్నాళ్లుగా నిరుద్యోగిత శాతం పెరుగుతోంది. గత ఆరేళ్లలో ఐదుసార్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగిత రేటు కంటే భారత్లో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నట్లు ముంబయికి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. కానీ, వాస్తవిక పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2018-21 మధ్య కాలం భారత ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘకాలం పాటు మందకొడిగా ఉంది. 1991లో ఆర్థిక సంక్షోభం అంచుకు చేరిన సమయంలో ఈ పరిస్థితి నెలకొంది.
రాజకీయ పరంగా చూసినా అధికార భాజపాకు ఇది పెను సవాలే. ఎందుకంటే 2014లో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. భారత్లో 135 కోట్ల మందిలో మూడింట రెండొంతుల మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేయగల వయస్సులో ఉన్నారంటే.. కొలువుల అవసరం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి యువతను బయటకు తీసుకురావాలంటే మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చుపెట్టాలి. కానీ, ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కూడా చాలా ముఖ్యం.
ఆదాయపు పన్ను మినహాయింపులు..
కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు కుంగడంతో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయపన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.2.5లక్షల నుంచి పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతోపాటు సెక్షన్ 80సీ డిడక్షన్ పరిధిని కూడా విస్తరించాల్సి ఉంది.
జీడీపీ వృద్ధిరేటు కొనసాగింపు