తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 8:58 AM IST

ETV Bharat / business

నిరుద్యోగం ఉన్నా.. సరైన దిశలోనే దేశం: సర్వే

భారత పట్టణవాసుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం సమస్యపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు 'ఇప్సోస్' సర్వే స్పష్టం చేసింది. వీరిలో 69 శాతం మంది.. ప్రస్తుతం దేశం సరైన దిశలోనే సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారని పేర్కొంది.

Unemployment top worry for urban Indians
భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్న నిరుద్యోగ సమస్య

నిరుద్యోగ రేటు రోజురోజుకూ పెరిగిపోతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా'ఇప్సోస్​' అనే సర్వే పట్టణవాసుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. అయితే వీరిలో 69 శాతం మంది.. ప్రస్తుతం దేశం సరైన దిశలోనే పయనిస్తున్నట్లు అభిప్రాయపడ్డారని వెల్లడించింది.

ఇప్సోస్​ అనే సర్వే సంస్థ 'వాట్​ వర్రీస్​ ది వరల్డ్​' పేరిట 28 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. ఆన్​లైన్​ ప్యానెల్​ వ్యవస్థ ద్వారా నెలవారీగా ఈ సర్వే నిర్వహించింది.ఈ సర్వే నిరుద్యోగంతోపాటు ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానతలు, వాతావరణ మార్పులు భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది.

భారత్​ ఆశావాదం

సర్వే ప్రకారం, ప్రపంచ పౌరుల్లో 61 శాతం మంది తమ దేశం తప్పుడు మార్గంలో పోతోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచ ధోరణికి భిన్నంగా 69 శాతం మంది పట్టణ భారతీయులు ఇండియా సరైన దిశలో పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరుద్యోగం విషయంలో మాత్రం 46 శాతం మంది భారత పట్టణవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని సర్వే స్పష్టం చేస్తోంది. గత అక్టోబర్​తో పోలిస్తే వీరు 3 శాతం పెరిగారని సర్వే తెలిపింది.

ప్రపంచ ధోరణి

ప్రపంచ పౌరులను పేదరికం, సామాజిక అసమానతలు ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయని సర్వే తెలిపింది. వీటి తరువాత నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అనిశ్చితి, ఆరోగ్య సంరక్షణలు కూడా వీరిని ఆందోళనకు గురిచేస్తున్నాయని విశ్లేషించింది.

ఇదీ చూడండి: హౌసింగ్ రేట్లు పెరుగుదలలో 47వ స్థానంలో భారత్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details