పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షుడిగా 2020-21 సంవత్సరానికి మీడియా ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఈ నెల 11-14 తేదీల్లో జరగబోయే ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశంలో(ఏజీఎమ్) ఫిక్కీ ప్రస్తుత ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంయుక్త మేనేజిగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి నుంచి శంకర్ బాధ్యతలు తీసుకోనున్నారు.
ఉదయ్ శంకర్ ప్రస్తుతం ది వాల్ డిస్నీ కంపెనీ(ఆసియా-పసిఫిక్) ప్రెసిడెంట్, స్టార్, డిస్నీ ఇండియా ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఫిక్కీకి తొలిసారిగా మీడియా-వినోద రంగ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా రాబోతున్నారు. ఉదయ్ శంకర్ తమ కంపెనీ బాధ్యతల నుంచి ఈ నెల 31న తప్పుకోనున్నట్లు ది వాల్ డిస్నీ కంపెనీ వెల్లడించింది.
ఇదీ చూడండి:ఫార్చూన్ జాబితాలో అడోబ్, మాస్టర్కార్డ్ సీఈఓలు