తెలంగాణ

telangana

ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఉదయ్​ శంకర్​

By

Published : Dec 5, 2020, 6:52 AM IST

2020-2021 సంవత్సరానికిగాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షుడిగా​ ఉదయ్​ శంకర్​ నియమితులయ్యారు. మీడియా-వినోద రంగ ఎగ్జిక్యూటివ్​ ఫిక్కీకి ప్రెసిడెంట్​గా రావడం ఇదే తొలిసారి.

uday shankar selceted as ficci new president for the year 2020-2021
ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఉదయ్​ శంకర్​

పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షుడిగా 2020-21 సంవత్సరానికి మీడియా ఎగ్జిక్యూటివ్​ ఉదయ్​ శంకర్​ నియమితులయ్యారు. ఈ నెల 11-14 తేదీల్లో జరగబోయే ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశంలో(ఏజీఎమ్​) ఫిక్కీ ప్రస్తుత ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్​ గ్రూప్​ సంయుక్త మేనేజిగ్​ డైరెక్టర్​ సంగీతారెడ్డి నుంచి శంకర్​ బాధ్యతలు తీసుకోనున్నారు.

ఉదయ్​ శంకర్​ ప్రస్తుతం ది వాల్​ డిస్నీ కంపెనీ(ఆసియా-పసిఫిక్​) ప్రెసిడెంట్​, స్టార్​, డిస్నీ ఇండియా ఛైర్మన్​గా కొనసాగుతున్నారు. ఫిక్కీకి తొలిసారిగా మీడియా-వినోద రంగ ఎగ్జిక్యూటివ్​ ప్రెసిడెంట్​గా రాబోతున్నారు. ఉదయ్​ శంకర్​ తమ కంపెనీ బాధ్యతల నుంచి ఈ నెల 31న తప్పుకోనున్నట్లు ది వాల్​ డిస్నీ కంపెనీ వెల్లడించింది.

ఇదీ చూడండి:ఫార్చూన్​ జాబితాలో అడోబ్​, మాస్టర్​కార్డ్​ సీఈఓలు

ABOUT THE AUTHOR

...view details