కొటక్ మహీంద్ర బ్యాంకు ఎండీ, సీఈవో ఉదయ్ కొటక్.. భారతీయ పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి సీఐఐ కొత్త కార్యవర్గాన్ని నేడు ప్రకటించింది. ఉదయ్ కొటక్ దాదాపు 20 సంవత్సరాల నుంచి సీఐఐలో పలు బాధ్యతలు చేపట్టారని సీఐఐ వెల్లడించింది. బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
సీఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కొటక్ - భారతీయ పారిశ్రామిక సమాఖ్య
సీఐఐ నూతన అధ్యక్షుడిగా కొటక్ మహీంద్ర బ్యాంకు ఎండీ, సీఈవో ఉదయ్ కొటక్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులు బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు.

సీఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కొటక్