కరోనా వ్యాప్తితో చైనాలో ఏర్పడిన ఉత్పత్తి మందగమనం.. రానున్న నెలల్లో ప్రపంచ ఎగుమతులను 50 బిలియన్ డాలర్ల మేరకు తగ్గిస్తుందని ఐరాస ఆర్థికవేత్తలు తెలిపారు. ముఖ్యంగా కరోనా వల్ల ప్రభావితమయ్యే మొదటి 15 ఆర్థికవ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా 348 మిలియన్ డాలర్ల మేర భారత్ నష్టపోతుందని అంచనా వేశారు.
ఐక్యరాజ్యసమితి వాణిజ్య, పెట్టుబడులు, అభివృద్ధి సమావేశం (యూఎన్సీటీఏడీ) తాజా నివేదిక ప్రకారం.. ఐరోపా సమాఖ్య, అమెరికా, జపాన్ ఎగుమతుల్లో కోతపడి తీవ్రంగా నష్టపోనున్నాయి.
ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో... ఐరోపా సమాఖ్య (15.6 బిలియన్ డాలర్లు), అమెరికా (5.8 బిలియన్ డాలర్లు), జపాన్ (5.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (3.8 బిలియన్ డాలర్లు), తైవాన్ (2.6 బిలియన్ డాలర్లు), వియత్నాం (2.3 బిలియన్ డాలర్లు) మేర నష్టపోనున్నాయి.
ప్రభావిత రంగాలు
కరోనా వల్ల అత్యంత ప్రభావితమయ్యే రంగాల్లో (ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్స్) పరికరాలు, యంత్రాలు, ఆటోమోటివ్, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.