భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తొలిసారిగా స్పందించారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం. మంచిది కాదు. భారత్కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలనుంది’’ అని పేర్కొన్నారు.
పౌర చట్టం, ఎన్ఆర్సీపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు - పౌరసత్వ చట్టం (సీఏఏ)పై
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల... పౌరసత్వ చట్టం (సీఏఏ)పై తొలిసారిగా స్పందించారు. ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు విచారకరమని, మంచిది కాదని పేర్కొన్నారు. భారత్కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలనుంది’’అని అన్నారు.
![పౌర చట్టం, ఎన్ఆర్సీపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు The current developments are sad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5702571-746-5702571-1578963377999.jpg)
ప్రస్తుత పరిణామాలు విచారకరం: సత్యనాదెళ్ల
అమెరికన్ జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే... సీఏఏను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేక దాని చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ఇలా స్పందించారా అన్న సందిగ్ధత తొలుత నెలకొంది. నిజానికి ఆయన చట్టబద్ధమైన వలస విధానం గురించే వ్యాఖ్యానించారని, దీని వల్ల ప్రతిభావంతులు సమాజ అభ్యున్నతికి అనేక విధాలా సాయపడగలరన్నది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది.
ఇదీ చూడండి : 40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు
Last Updated : Jan 14, 2020, 1:56 PM IST