సరికొత్త ఆఫర్లతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎప్పుడూ ఏదో ఒక సేల్ నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా పిల్లల కోసం 'కిడ్స్ కార్నివల్' పేరుతో కొత్త సేల్ ప్రారంభించింది. మంగళవారమే (16వ తేదీ) ప్రారంభమైన ఈ ఆఫర్.. ఈ నెల 21 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో నోట్బుక్స్, బోర్డ్ గేమ్లు, స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి సహా పిల్లలు వినియోగించే ఇతర అన్ని ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.
పిల్లలకు సంబంధించిన వస్తువులతో పాటు ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టీవీ డివైజ్, కిండల్ ఈ-రీడర్ వంటి ఉపకరణాలపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.