మార్కెట్ బెంచ్మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 100 పాయింట్లకు పైగా పెరిగింది. అనంతరం.. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు.
తొలుత అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐసీటీ లాభాలను మూటగట్టుకున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 40 వేల 37 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11 వేల 858 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ (2.68 శాతం మేర) రాణిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, టీసీఎస్, ఆర్ఐఎల్, ఎస్బీఐ (1.98 శాతం మేర) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు