తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూల పవనాలు.. లాభాల్లో మార్కెట్లు - stock markets latrest news

స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 20 పాయింట్లు పెరిగి 40వేల 365కు చేరింది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 11వేల 922వద్ ట్రేడ్ అవుతోంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, హాంకాంగ్​ రాజకీయ పరిస్థితులు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Nov 13, 2019, 10:35 AM IST

అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం సల్వ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు మెరుగుపడి 40వేల 365కు చేరింది. 9 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 11వేల 922కు పెరిగింది.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుందో లేదో అనే సందేహాలు, హాంకాంగ్​లో రాజకీయ అనిశ్చితి వంటి కారణాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

యెస్ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్, హెచ్​సీఎల్ షేర్లు 2శాతానికి పైగా లాభ పడ్డాయి.

ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్​ షేర్లు 1.3శాతానికిపైగా నష్టపోయాయి.

ఇదీ చూడండి: ఒకే సెట్​ టాప్​ బాక్స్​తో టీవీ, వీడియో స్ట్రీమింగ్​ సేవలు..

ABOUT THE AUTHOR

...view details