తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2020, 3:57 PM IST

ETV Bharat / business

2 నెలల్లో 13 వేల పాయింట్లు మింగేసిన కరోనా

41,953... సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం. జనవరి 14న ఈ రికార్డు నమోదైంది. కానీ 2 నెలలకే పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం 30 వేల మార్కుకు దిగువకు పతనమైంది సెన్సెక్స్. ఎందుకిలా? ఈ 2 నెలల్లో ఏం జరిగింది?

corona effect on stocks
స్టాక్ మార్కెట్లపై కరోనా పడగ

కరోనా భయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న నేపథ్యంలో మాంద్యం రావచ్చనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి.

కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. నెలాఖరు(ఫిబ్రవరి 28) నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

  • ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం (మార్చి 18) 28,870 వద్ద, నిఫ్టీ 8,469 వద్ద స్థిరపడ్డాయి.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి ట్రేడింగ్ ఇలా..

తేదీ సెన్సెక్స్ నిఫ్టీ
ఫిబ్రవరి 28 -1,448 -431
మార్చి 2 -153 -69
మార్చి 3 +480 +171
మార్చి 4 -214 -52
మార్చి 5 +61 +18
మార్చి 6 -894 -280
మార్చి 9 -1,942 -538
మార్చి 11 +62 +07
మార్చి 12 -2,919 -868
మార్చి 13 +1,325 +365
మార్చి 16 -2,713 -758
మార్చి 17 -811 -230
మార్చి 18 (నేడు) -1,710 -498

ఇదీ చూడండి:'భారత వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతమే!'

ABOUT THE AUTHOR

...view details