తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపరుల అప్రమత్తత.. 9,900 దిగువకు నిఫ్టీ

By

Published : Jun 17, 2020, 9:57 AM IST

Updated : Jun 17, 2020, 3:57 PM IST

stocks markets today
స్టాక్​ మార్కెట్​ వార్తలు

15:53 June 17

సరిహద్దు భయాలు..

స్టాక్​ మార్కెట్లుకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. మంగళవారం సానుకూలంగా ముగిసిన సూచీలు.. బుధవారం మళ్లీ నష్టాలను నమోదు చేశాయి.  

సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 33,508 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 9,981 వద్ద స్థిరపడింది.

భారత్-చైనా సరిహద్దు వివాదంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాలతో మదుపరులు అప్రమత్తత పాటించడం నష్టాలకు ప్రధాన కారణం.

12:09 June 17

కోలుకుంటున్న మార్కెట్లు..

మిడ్​ సెషన్​లో కాస్త కోలుకుంటన్నాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా బలపడి 33,645 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ ఫ్లాట్​గా 9,916 వద్ద కొనసాగుతోంది.

  • మారుతీ, భారతీ ఎయిర్​టెల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎం&ఎం, హీరో మోటార్స్, పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:40 June 17

ఊగిసలాట ధోరణి..

30 షేర్ల ఇండెక్స్..

స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా క్షీణతతో.. 33,560 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు కోల్పోయి 9,906 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. సెషన్ ఆరంభం నుంచే సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

  • వాహన, ఐటీ, లోహ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. విద్యుత్, బ్యాంకింగ్, మౌలిక వసతుల రంగ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
  • మారుతీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, భారతీఎయిర్​టెల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • పవర్​ గ్రిడ్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Jun 17, 2020, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details