తెలంగాణ

telangana

ETV Bharat / business

యుద్ధ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - Stock Market on thursday

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​.. మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. గురువారం బీఎస్​ఈ సెన్సెక్స్​ 366 పాయింట్ల నష్టంతో.. 55 వేల 102కు చేరింది.

Stock Market Close
స్టాక్ మార్కెట్లు

By

Published : Mar 3, 2022, 3:47 PM IST

Stock Market Close: ఉక్రెయిన్​- రష్యా యుద్ధ ప్రభావం స్టాక్​ మార్కెట్లపై గట్టిగా పడింది. దేశీయ సూచీలు గురువారం మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్‌ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది. గురువారం ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 366 పాయింట్ల నష్టంతో.. 55 వేల 102కు చేరింది.

నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 498 వద్ద ఉంది.

ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం.. బ్రెంట్​ క్రూడ్​ బ్యారెల్​ ధర 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకుపైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

లాభనష్టాల్లో..

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, విప్రో, టెక్​ మహీంద్రా, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​ రాణించాయి.

అల్ట్రా టెక్​ సిమెంట్​, ఏషియన్​ పెయింట్స్​, హిందుస్థాన్ యూనిలీవర్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్, మారుతీ​ డీలాపడ్డాయి.

ఇదీ చదవండి:స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details