తెలంగాణ

telangana

ETV Bharat / business

అలాగైతే 5జీ వేలంలో పాల్గొనం: ఎయిర్‌టెల్‌

5జీ వేలంలో రిజర్వ్​ ధర ఎక్కువగా ఉంటే తాము బిడ్​లో పాల్గొనబోమని ఎయిర్​టెల్​ ఎండీ, సీఈవో గోపాల్‌  తెలిపారు. ప్రస్తుతం స్పెక్ట్రం వేలంపైనే కంపెనీ ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇంటి లోపల, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు 1000 ఎంఏహెచ్‌ ఫ్రీక్వెన్సీ కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.

By

Published : Oct 28, 2020, 9:20 PM IST

Spectrum auction likely early next year; will not bid for 5G spectrum if reserve price is high: Bharti Airtel
అలాగైతే 5జీ వేలంలో పాల్గొనం: ఎయిర్‌టెల్‌

దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి టెలికాం శాఖ.. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య వేలం నిర్వహించే అవకాశం ఉందని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఒకవేళ రిజర్వ్‌ ధర ఎక్కువగా ఉంటే తాము వేలంలో పాల్గొనబోమని ఆ కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్‌ తెలిపారు. ప్రస్తుతం స్పెక్ట్రం వేలం గురించే కంపెనీ ఆలోచన చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి లోపల, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు 1000 ఎంఏహెచ్‌ ఫ్రీక్వెన్సీ కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

"జనవరి నుంచి మార్చి మధ్య టెలికాం విభాగం వేలం నిర్వహించే అవకాశం ఉందని మేం విన్నాం. ఒకవేళ 5జీకి రిజర్వ్‌ ధర ఎక్కువగా ఉంటే బిడ్‌లో పాల్గొనం. అంత ధరను మేం భరించలేం" అని గోపాల్​ చెప్పుకొచ్చారు.

5జీ సేవలకు సంబంధించి 3,300-3,600 ఎంఏహెచ్‌ బ్యాండ్‌ సరైనదని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ భావిస్తోంది. అయితే, ఒక ఎంఏహెచ్‌ స్పెక్ట్రమ్‌ ధరను రూ.492 కోట్లుగా ట్రాయ్‌ సిఫార్సు చేసింది. ట్రాయ్‌ చెప్పిన దాని ప్రకారం 5జీ స్పెక్ట్రం కోసం కంపెనీ రూ.50వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అంత భారం తాము భరించలేమని గతంలో తెలిపింది.

అలాగే, 2జీ సేవల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన 1800 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌ను కొనుగోలు విషయంలో ఆలోచన చేస్తున్నామని చెప్పింది ఎయిర్​టెల్​ సంస్థ. 4జీ సేవలపై దృష్టి సారించేందుకు 2,300 ఎంఏహెచ్‌ బ్యాండ్‌పై దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details