ఆర్థిక, టెలికాం రంగాల్లో లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 414 పాయింట్లు కోల్పోయి.. 33,957 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 10,047 వద్ద స్థిరపడింది.
హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,811 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,881 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,291 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,021 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..