తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ నిర్ణయానికి ముందు ఒడుదొడుకుల్లో ​మార్కెట్లు - ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడం, ఆర్​బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

Indices recover, Nifty around 12K
ఆర్​బీఐ నిర్ణయానికి ముందు ఒడుదొడుకుల్లో ​మార్కెట్లు

By

Published : Dec 4, 2019, 10:26 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం విషయంలో 2020 అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచిచూడాల్సిందేనని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్​ ఇండియా ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం మరో కారణం.

ప్రారంభంలో 119 పాయింట్లు నష్టపోయిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 39 పాయింట్లు లాభపడి 40 వేల 715 వద్ద కొనసాగుతోంది. మొదట 12 వేల మార్కును కోల్పోయిన జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 11 పాయింట్లు లాభపడి 12 వేల 5 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

టాటా మోటార్స్, భారతీ ఇన్​ఫ్రాటెల్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​ బ్యాంకు, ఓఎన్​జీసీ రాణిస్తున్నాయి.

బజాజ్​ ఫిన్​సెర్వ్​, కోల్​ ఇండియా, టాటా స్టీల్​, లార్సెన్​ అండ్ టుబ్రో, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, పవర్​ గ్రిడ్ కార్ప్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, షాంఘై కాంపోజిట్​, కోస్పీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి

రూపాయి విలువ 10 పైసలు క్షీణించి... ఒక డాలరుకు రూ.71.76గా ఉంది.

ఇదీ చూడండి:ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​ పిచాయ్​కు పదోన్నతి

ABOUT THE AUTHOR

...view details