ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన దేశీయ స్టాక్మార్కెట్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సూచనలకు తోడు.. ద్రవ్యోల్బణం పెరగడం, మందగమనం కొనసాగుతుండడం, మున్ముందు ఆర్థికవృద్ధి మరింత దిగజారుతుందనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 41 వేల 558 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 12 వేల 255 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, యూపీఎల్, హీరోమోటోకార్ప్, నెస్లే, ఎమ్ అండ్ ఎమ్, భరతీ ఎయిర్టెల్ రాణించాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు