తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2020, 3:47 PM IST

Updated : Nov 12, 2020, 4:18 PM IST

ETV Bharat / business

8 రోజుల లాభాలకు బ్రేక్- 43,400 దిగువకు సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరుకు గురువారం అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి.. 43,400 మార్క్​ దిగువకు చేరింది. నిఫ్టీ 58 పాయింట్లు తగ్గింది. అర్థిక షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

share markets update
షేర్ మార్కెట్ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజులు నమోదు చేసిన లాభాల జోరుకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి.. 43,357 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 12,691 వద్దకు చేరింది.

ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దేశ చరిత్రలోనే తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందన్న ఆర్​బీఐ నిపుణుల అంచనాలూ నష్టాలకు కారణమయ్యాయి. ఆర్థిక షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్రం మూడో దశ ఉద్దీపన చర్యలను ప్రకటించినా మార్కెట్లపై ఆ ప్రభావం అంతగా కనిపించలేదు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 43,544 పాయింట్ల అత్యధిక స్థాయి, 43,127 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 12,741 పాయింట్ల గరిష్ఠ స్థాయి 12,624 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​యూఎల్​, ఐటీసీ, ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి.

ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. టోక్యో మినహా షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ అతి స్వల్పంగా 0.07 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 43.77 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:చరిత్రలోనే తొలిసారి మాంద్యంలోకి భారత్!

Last Updated : Nov 12, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details