తెలంగాణ

telangana

ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు

By

Published : Aug 9, 2019, 12:02 PM IST

దివాలా స్మృతికి చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ పలువురు నిర్మాణదారులు దాఖలు చేసిన 180కిపైగా పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గృహ యజమానులకు ఆర్థిక రుణదాతల హోదాను కల్పిస్తూ ఐబీసీకి చేసిన సవరణలను న్యాయస్థానం సమర్థించింది.

ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు

గృహ యజమానులకు ఆర్థిక రుణదాతల హోదాను ఇస్తూ... దివాలా స్మృతి(ఇన్​సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్​సీ కోడ్​-ఐబీసీ)కి చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించింది.

జస్టిస్ ఆర్​ఎఫ్ నారిమన్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... పలువురు బిల్డర్లు దాఖలు చేసిన 180కిపైగా పిటిషన్లను కొట్టివేసింది. రెరా ప్రకారం గృహకొనుగోలుదారుల సమస్యలకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని, ఐబీసీకి చేసిన సవరణలు నకీలీలకు అవకాశాలను కల్పిస్తాయన్న వాదనలను తోసిపుచ్చింది. స్థిరాస్తి​ రంగాన్ని నియంత్రించే రెరా చట్టాన్ని, ఐబీసీ సవరణలతో సహా శ్రద్ధగా చదవాలని సూచించింది. వివాదమే వస్తే ఐబీసీ​ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

నిజమైన గృహ కొనుగోలుదారులు మాత్రమే నిర్మాణదారుపై దివాలా ప్రక్రియ ప్రారంభించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో దిట్టుబాటు చర్యలు తీసుకొని అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది.

ఇదీ చూడండి: వార్తల కోసం కోట్ల​ డాలర్లు ఇస్తామంటున్న ఫేస్​బుక్​!

ABOUT THE AUTHOR

...view details