తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లు తగ్గించిన ఎస్​బీఐ.. మరింత చౌకగా రుణాలు - ఎమ్​సీఎల్​ఆర్​

ఎస్​బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. ఫిబ్రవరి 10 నుంచి ఎమ్​సీఎల్​ఆర్​లో 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ తగ్గింపుతో, ఫండ్​ బేస్డ్​ రేటు (ఎమ్​సీఎల్​ఆర్​) ఒక సంవత్సర ఉపాంత వ్యయం 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గిందని స్పష్టం చేసింది.

SBI cuts MCLR by 5 bps across tenors
ఎమ్​సీఎల్​ఆర్​లో 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఎస్​బీఐ

By

Published : Feb 7, 2020, 1:07 PM IST

Updated : Feb 29, 2020, 12:40 PM IST

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్​బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ఎమ్​సీఎల్​ఆర్​లో 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎమ్​సీఎల్​ఆర్​లో కోత విధించడం... వరుసగా ఇది తొమ్మిదోసారి. ఈ తగ్గింపుతో, ఫండ్​ బేస్డ్​ రేటు (ఎమ్​సీఎల్​ఆర్​) ఒక సంవత్సర ఉపాంత వ్యయం 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటించింది.

ఆర్​బీఐ ప్రకటన తరువాత

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో... రెపోరేటును 5.15 శాతం యథావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎస్​బీఐ... ఎమ్​సీఎల్​ఆర్ తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.

వడ్డీరేట్లు తగ్గింపు

వ్యవస్థలో మిగులు ద్రవ్యత ఉన్న దృష్ట్యా, ఫిబ్రవరి 10 నుంచి రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ.2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్​ డిపాజిట్లు (రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ)పై వడ్డీరేటు తగ్గించినట్లు ఎస్​బీఐ తెలిపింది.

ఎస్​బీఐ రిటైల్ విభాగంలో టర్మ్​ డిపాజిట్ల రేట్లను 10-50 బీపీఎస్, బల్క్ విభాగంలో 25-50 బీపీఎస్ తగ్గించింది.

ఆర్​బీఐ విధాన చర్యల ప్రభావం, డిపాజిట్ రేట్ల తగ్గింపు... అనుసరించే తదుపరి సమీక్షలో ఎమ్​సీఎల్​ఆర్​ గురించి నిర్ణయం తీసుకుంటామని ఎస్​బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: గేమర్స్​ కోసం రియల్​మీ బడ్జెట్ స్మార్ట్​ఫోన్

Last Updated : Feb 29, 2020, 12:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details