తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2021, 12:52 PM IST

Updated : Aug 16, 2021, 2:54 PM IST

ETV Bharat / business

ఎస్​బీఐ ప్రత్యేక ఆఫర్లు- వాటిపై 70% డిస్కౌంట్​!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. పండుగల సీజన్​ నేపథ్యంలో.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వివిధ కొనుగోళ్లకు ఎస్​బీఐ సాధనాల ద్వారా చెల్లింపులు జరిపితే.. 70 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. రిటైల్ వినియోగదారులకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వంద శాతం రద్దు చేసింది.

SBI new offers
ఎస్​బీఐ ఆఫర్లు

భార‌త్ 75వ స్వాతంత్య్ర దినోత్సావాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లు ర‌ద్దు చేయ‌డం సహా వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది.

గృహ రుణాల‌పై ప‌రిమిత కాలం వ‌ర‌కు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ గ‌తంలోనే ప్ర‌క‌టించింది. అయితే తాజాగా కారు రుణాలను కూడా 100 శాతం ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా అందిస్తుంది. ఇది కూడా ప‌రిమిత కాల ఆఫ‌ర్ మాత్ర‌మే. 2022, జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. అంతేకాకుండా వినియోగ‌దారులు కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌పై 90 శాతం వ‌ర‌కు రుణాల పొందొచ్చు.

యోనో యాప్​తో వడ్డీ రాయితీ..

యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికి 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) మేర వ‌డ్డీ రాయితీ ఆఫ‌ర్ చేస్తుంది ఎస్​బీఐ. యోనో యాప్ వినియోగ‌దారులు కొత్త కారు కొనుగోలు చేయాల‌ని ప్లాన్​లో ఉంటే 7.5 శాతం అతి త‌క్కువ వార్షిక వ‌డ్డీతో రుణం తీసుకోవ‌చ్చు.

అదేవిధంగా బంగారంపై రుణాల‌ను తీసుకునే వారికి కూడా 75 బేసిస్ పాయింట్లు మేర వ‌డ్డీ రేటు త‌గ్గిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు ఏ ఛాన‌ల్‌ ద్వారా(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, యోనోయాప్‌) అయినా 7.5 శాతం వార్షిక వ‌డ్డీతో బంగారంపై రుణాల‌ను పొంద‌వ‌చ్చు. యోనో యాప్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు కూడా మాఫీ చేస్తుంది.

ఎస్‌బీఐ వ్య‌క్తిగ‌త‌, పెన్ష‌న్​లోన్‌ వినియోగ‌దారులు ఏ ఛాన‌ల్ ద్వారా రుణం తీసుకున్న‌ప్ప‌టికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్న‌ట్లు బ్యాంక్ ప్ర‌క‌టించింది.

కొవిడ్ వారియ‌ర్స్‌కు ప్రత్యేక రాయితీలు..

వ్య‌క్తిగ‌త రుణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న కొవిడ్ వారియ‌ర్స్‌(ఫ్రంట్‌లైన్ హెల్త‌్​ కేర్ వ‌ర్క‌ర్స్‌)కు 50 బేసిస్ పాయింట్ల ప్ర‌త్యేక వ‌డ్డీ రాయితీని ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీన్ని త్వ‌ర‌లోనే కారు, బంగారు రుణాల‌ దర‌ఖాస్తుదారుల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రిటైల్ డిపాజిటర్ల కోసం, 'ప్లాటినం టర్మ్ డిపాజిట్‌లను' ప్రవేశపెడుతున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఇది ఆగ‌ష్టు 15 నుంచి సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌నుంది.

పండుగ ఆఫర్లు..

రాఖీ పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది ఎస్​బీఐ.

'ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌'లో బహుమతులు కొనుగోలు చేసేవారు ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తే 20 శాతం కచ్చితమైన రాయితీ పొందొచ్చు. ఎంత కనీస మొత్తానికైనా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.999 వరకు రాయితీ పొందొచ్చు. 'ఎస్‌బీఐ20' అనే కూపన్‌ కోడ్‌ ఉపయోగించాలి. ఈ ఆఫర్‌ ఆగస్టు 22 వరకు అందుబాటులో ఉండనుంది.

ఇక గిఫ్టింగ్‌ పోర్టల్‌ ఐజీపీ.కామ్‌లో బహుమతులు కొనుగోలు చేసేవారికి ఎస్‌బీఐ సాధనాల ద్వారా చెల్లింపులు చేస్తే 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా చెల్లిస్తే అదనంగా మరో 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. దీనికి 'ఐజీపీఎస్‌బీఐ' అనే కూపన్‌ కోడ్‌ వినియోగించాలి. ఈ ఆఫర్‌ కూడా 22 ఆగస్టు వరకు అందుబాటులో ఉండనుంది.

ఇదీ చదవండి:వ్యక్తిగత పాలసీ X ఫ్యామిలీ ఫ్లోటర్.. ఏది బెటర్​?

Last Updated : Aug 16, 2021, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details