తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డు: ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా 'ఆరాంకో'

సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో చమురు సంస్థ ట్రేడింగ్​ ప్రారంభించిన తొలిరోజే చరిత్ర సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే ఆరాంకో షేరు​ విలువ 10శాతం వృద్ధి చెంది.. 1.88 ట్రిలియన్​ డాలర్ల మార్కెట్​ విలువకు చేరింది. మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలను సైతం వెనక్కి నెట్టి సరికొత్త శిఖరాలను అధిరోహించింది.

By

Published : Dec 11, 2019, 6:34 PM IST

Saudi Aramco starts trading, gaining 10% and reaching USD 1.8T
రికార్డు: ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా 'ఆరాంకో'

సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరాంకో తొలిసారి ట్రేడింగ్​ను ప్రారంభించింది. సౌదీ తాదావుల్​ స్టాక్​ ఎక్సేంజ్​లో మొదటి రోజే సంస్థ షేర్లు 10శాతం వృద్ధి సాధించాయి. ఆరాంకో మార్కెట్​ విలువ 1.88 ట్రిలియన్​ డాలర్లకు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.

1.5శాతం వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన ఆరాంకో.. ఒక్కో షేరు 32 సౌదీ రియాల్స్​(8.53డాలర్లు)కు అమ్మింది. ఉదయం 10:30 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఒక్కో షేరు విలువ 10శాతం పెరిగి 35.2​ రియాల్స్​కు చేరింది. ట్రేడింగ్​ ముందే ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​(ఐపీవో) ద్వారా 25.6 బిలియన్​ డాలర్లు రాబట్టి చరిత్ర సృష్టించింది ఆరాంకో.

1.88 ట్రిలియన్ డాలర్ల మార్కెట్​ విలువతో మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలను అధిగమించింది ఆరాంకో. టాప్​ 5 చమురు సంస్థలు మొబిల్, టోటల్​, రాయల్ డచ్​ షెల్​, చెవ్రాన్​, బీపీలనూ వెనక్కినెట్టింది.

మొత్తం 1.5 శాతం షేర్లలో 0.5శాతం షేర్లను మదుపరులకు, 1శాతం షేర్లను సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించింది ఆరాంకో. అయితే కేవలం సౌదీ పౌరులు, ఆ దేశంలో నివసేంచే వారు, గల్ఫ్​ దేశస్థుల మదుపరులకు మాత్రమే ఈ షేర్లను కొనుగోలు చేసే వీలు కల్పించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details