తెలంగాణ

telangana

ETV Bharat / business

కృత్రిమ మేధ కెమెరాలతో 'శాంసంగ్'​ 5జీ స్మార్ట్​ఫోన్లు

శాంసంగ్... గెలాక్సీ ఎస్​ 20 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఆవిష్కరించింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథస్సు) కెమెరాలను పొందుపరిచినట్లు పేర్కొంది. శాంసంగ్ ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను కూడా ఆవిష్కరించింది.

By

Published : Feb 12, 2020, 1:59 PM IST

Updated : Mar 1, 2020, 2:13 AM IST

Samsung launches Galaxy S20 flagship smartphones
శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 20 సిరీస్ ఫోన్లు

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్​... 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టెక్నాలజీతో కొత్తశ్రేణి ఫ్లాగ్​షిప్​ ఫోన్​ 'గెలాక్సీ ఎస్​ 20 సిరీస్​'ని ఆవిష్కరించింది. హై-ఎండ్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి శాంసంగ్ దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం యాపిల్​, వన్​ప్లస్​ల నుంచి శాంసంగ్ గట్టిపోటీని ఎదుర్కొంటోంది.

"ఈ కొత్త దశాబ్దంలో కమ్యూనికేషన్​ వ్యవస్థను '5జీ' పూర్తిగా మార్చివేయనుంది. అందుకే గెలాక్సీ ఎస్​20 వేరియంట్లు-గెలాక్సీ ఎస్​ 20, గెలాక్సీ ఎస్ 20+, గెలాక్సీ ఎస్​ 20 ఆల్ట్రాలను 5జీ కనెక్టివిటీతో తీసుకొస్తున్నాం."

- టీఎం​ రోహ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్​, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్

సురక్షితం

శాంసంగ్​ 'అన్​ప్యాక్డ్​ 2020' కార్యక్రమంలో గెలాక్సీ ఎస్​ 20 సిరీస్​ను ఆవిష్కరించింది. ఇందులో హార్డ్​వేర్ ఆధారిత దాడుల నుంచి రక్షించే సరికొత్త, సురక్షితమైన ప్రాసెసర్ వాడినట్లు పేర్కొంది.

కెమెరా పనితనం

గెలాక్సీ ఎస్​ 20 సిరీస్ ఫోన్లలోని కెమెరాల రిజల్యూషన్​ గణనీయంగా పెంచామని శాంసంగ్ తెలిపింది. ఎస్​ 20, ఎస్​ 20 ప్లస్​ల్లో 64 ఎంపీ కెమెరా, ఎస్ 20 ఆల్ట్రాలో 108 ఎంపీ కెమెరా పొందుపరిచినట్లు స్పష్టం చేసింది.

మార్చి 6 నుంచి...

గెలాక్సీ ఎస్​ 20 సిరీస్ ఫోన్లు మార్చి 6 నుంచి అందుబాటులోకి రానున్నాయని శాంసంగ్ తెలిపింది. వీటి ప్రాథమిక ధర 999 డాలర్లు (సుమారు రూ.72,000), రూ.1,399 డాలర్లు (సుమారు లక్ష రూపాయలు) గా ఉంటుందని స్పష్టం చేసింది.

గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​...

శాంసంగ్ ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ మొదటి మడత ఫోను 'గెలాక్సీ ఫోల్డ్​' కంటే భిన్నంగా ఉంది. ఈ కొత్త మడత ఫోన్​ స్క్రీన్​ను 2,00,000 సార్లు మడతపెట్టి, విప్పుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనిని ఫిబ్రవరి 14న 1,380 డాలర్లు (సుమారు రూ.99 వేలు) ధర విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:షియోమీ బడ్జెట్ ఫోన్​: ​రెడ్​మీ 8ఏలో మరిన్ని ఫీచర్లు

Last Updated : Mar 1, 2020, 2:13 AM IST

ABOUT THE AUTHOR

...view details