తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2020, 6:11 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

ETV Bharat / business

5 కెమెరాలతో మార్కెట్లోకి గెలాక్సీ ఏ51

శాంసంగ్ భారత మార్కెట్లోకి గెలాక్సీ ఏ-51ను విడుదల చేసింది. మొదటిసారిగా 5 కెమెరాలతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ.23,999గా నిర్ణయించింది. జనవరి 31 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది.

Samsung Galaxy A51
5 కెమెరాలతో మార్కెట్లోకి గెలాక్సీ ఏ51

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ... గెలాక్సీ ఏ-51ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఏ-50కి కొనసాగింపుగా మిలినియల్స్ కోసం సరికొత్త ఫీచర్స్‌తో ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జనవరి 31 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో గెలాక్సీ ఏ-51 అమ్మకాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద అమెజాన్‌ పే తో ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. దానితోపాటు ఒకసారి ఉచిత స్ర్కీన్‌ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది.

గెలాక్సీ ఏ51 ఫీచర్లు

  • 8జీబీ ర్యామ్‌, 128జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం
  • ఆండ్రాయిడ్ 10 ఒన్ యుఐ 2.0 ఓఎస్‌
  • 2.3 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్‌ ఎక్స్‌నాస్‌ 9611 ప్రాసెసర్‌
  • 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ (1080x2400 పిక్సెల్) సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
  • 4,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో 15వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్ బ్యాటరీ

కెమెరా

ఇందులో వెనకవైపు ఉన్న 4 కెమెరాలు, ఓ సెల్ఫీ కెమెరాలున్నాయి.

  • 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
  • 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా
  • 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • 5 మెగాపిక్సెల్ డెప్త్‌ సెన్సార్‌
  • 32 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా

ధర ఎంతో తెలుసా?

గెలాక్సీ ఏ51 ధరను రూ.23,999గా శాంసంగ్​ నిర్ణయించింది. ప్రిసమ్ క్రష్‌ బ్లాక్‌, వైట్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

ఇదీ చూడండి: భారత్​లో వార్తల ప్రోత్సాహానికి గూగుల్​ సాయం!

Last Updated : Feb 28, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details