తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు మార్కెట్లోకి శాంసంగ్​ మడత ఫోన్లు

శాంసంగ్​ గెలాక్సీ మడత ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్​ను దక్షిణ కొరియాలో నేడు విడుదల చేస్తోంది శాంసంగ్.

By

Published : Sep 6, 2019, 8:02 AM IST

Updated : Sep 29, 2019, 2:58 PM IST

నేడు మార్కెట్లలోకి శాంసంగ్​ మడత ఫోన్లు

మొబైల్​ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ మడత ఫోన్లను నేడు మార్కెట్లోకి విడుదల చేస్తోంది మొబైల్​ దిగ్గజం శాంసంగ్​. దక్షిణ కొరియాలో నేటి నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్​ అందుబాటులో ఉంటుందని శాంసంగ్​ తెలిపింది.

ఏప్రిల్ 26నే ఈ ఫోన్​ను విడుదల చేయాలని భావించినా టెస్టింగ్ దశలో డిస్​ప్లేపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఫోన్ మడత పెట్టేందుకు సహకరించే కీలు భాగాలకు ఇరువైపులా (పైనా, కింద) అదనపు రక్షణ కవచాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఫోల్డబుల్ ఫోన్​ యూజర్లకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని శాంసంగ్​ చెబుతోంది.

నేడు మార్కెట్లలోకి శాంసంగ్​ మడత ఫోన్లు

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు:

  • వెనుక కెమెరా: 16 ఎంపీ+ 12 ఎంపీ+ 12 ఎంపీ (3 కెమెరాలు)
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 16 జీబీ ర్యామ్/512 జీబీ ఇంటర్నల్​ మెమొరీ
  • క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్

ఇతర కీలక ఫీచర్లతో ఆకట్టుకునే ఈ ఫోన్​ను భారత్​లోనే ముందుగా విడుదల చేయాలనుకుంది శాంసంగ్​. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్​లో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:టీచర్స్​ డే: నిష్ఠతో ఉపాధ్యాయ శిక్షణ

Last Updated : Sep 29, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details