తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ విధానం సులభతరం ఆలస్యం - GSTR

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్న్​ దాఖలును మరింత సులభతరం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్​ చేపట్టిన పైలట్​ ప్రాజెక్ట్ వాయిదా పడింది. నూతన సాఫ్ట్​వేర్​ అందుబాటులోకి వచ్చాక, జీఎస్టీ కౌన్సిల్​ నోటిఫై చేసిన అనంతరం నూతన రిటర్న్​ ఫారాలు అందుబాటులోకి వస్తాయి.

సరళమైన జీఎస్టీ రిటర్నుల పైలెట్ ప్రాజెక్ట్ వాయిదా!

By

Published : Mar 31, 2019, 1:39 PM IST

Updated : Mar 31, 2019, 3:06 PM IST

జీఎస్టీ విధానం సులభతరం ఆలస్యం

ఏప్రిల్​ 1 నుంచి సరళీకృత నెలవారీ 'వస్తు, సేవల పన్ను' (జీఎస్టీ) రిటర్న్​ఫారాల విడుదలకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సాఫ్ట్​వేర్​ సిద్ధమయ్యాక దీన్ని తీసుకురానున్నారు. జీఎస్టీ మండలి​ నోటిఫై చేసిన అనంతరం నూతన సరళీకృత జీఎస్టీ ఫారా​లు అందుబాటులోకి రానున్నాయి.

పన్ను చెల్లింపుదారులు సులభంగా జీఎస్టీ రిటర్న్​లు దాఖలు చేయడానికి సరికొత్త విధానం తీసుకురావాలని గతేడాది జూలైలో జీఎస్టీ మండలి​ నిర్ణయించింది. ఈ ఏప్రిల్​ 1 నుంచి 'సహజ్​, సుగమ్'​ ఫారాలతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని తీర్మానించింది.

కొత్త రిటర్న్​ ఫైలింగ్​ విధానం కింద, ఎలాంటి కొనుగోళ్లు చేయని పన్ను చెల్లింపుదారులు అవుట్​ పుట్​ టాక్స్​, ఇన్​పుట్ టాక్స్​ దాఖలు చేయనవసరం లేదు. ఒక నిల్ రిటర్న్​ దాఖలు చేస్తే సరిపోతుంది. రూ.5 కోట్లలోపు టర్నోవర్​ ఉన్న పన్ను చెల్లింపుదారులు స్వీయ ధ్రువీకరణ ద్వారా త్రైమాసిక పన్ను రిటర్న్​లను దాఖలు చేయవచ్చు.

ఇదీ చూడండి:అమెజాన్ అధిపతి ఫోన్​ హ్యాకింగ్ సౌదీ పనే!

Last Updated : Mar 31, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details