తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 9:48 PM IST

ETV Bharat / business

క్యూ3లో రిలయన్స్​ లాభం రూ.13,101కోట్లు

ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో 12శాతం నికర లాభాలను ఆర్జించింది రిలయన్స్​ ఇండస్ట్రీస్​. రూ. 13,101కోట్ల లాభాన్ని పొందినట్టు ఆ సంస్థ వెల్లడించింది. అటు జియో ప్లాట్​ఫామ్స్​లోనూ 15.5 శాతం లాభాలు నమోదు చేసినట్టు పేర్కొంది.

Reliance net profit up 12 pc in Q3 at Rs 13,101 cr
క్యూ3లో రిలయన్స్​ లాభం రూ.13,101 కోట్లు

ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 12 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్​ నుంచి డిసెంబర్​ మధ్యకాలంలో నికరంగా రూ.13,101 కోట్లు లాభపడింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.11,640 కోట్లు ఆర్జించినట్టు ఆ సంస్థ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో అన్ని కార్యకలాపాల ద్వారా రూ.1,28,450 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది రిలయన్స్​. ఏడాది క్రితం ఇది రూ.1,57,165 కోట్లుగా ఉండటం గమనార్హం.

రిలయన్స్​ జియోలోనూ..

డిజిటల్​, టెలికామ్​ సేవల్ని అందిస్తోన్న జియో ప్లాట్​ఫామ్స్​లో భారీ లాభాలను ఆర్జించింది రిలయన్స్​. 2020 అక్టోబర్​-డిసెంబర్​ మధ్యకాలంలో.. రిలయన్స్​ జియో నికర లాభం 15.5 శాతం మేర పెరిగి.. రూ.3,489 కోట్లకు చేరిందని దాని మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్​ శుక్రవారం తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో అది రూ. 3,020 కోట్లుగా నమోదైంది.

2020 డిసెంబర్​ చివరి నాటికి మొత్తం 41కోట్ల మంది జియో కస్టమర్లతో.. క్యూ3లో రూ.22,858 కోట్ల రాబడి పొందినట్టు తెలిపింది రిలయన్స్​. క్యూ3లో ఒక్కో వినియోగదారుని నుంచి సగటున నెలకు రూ.145 ఆదాయం పొందగా... క్యూ2లో ఈ ఆదాయం రూ.151 గా ఉండేదని తెలిపింది.

ఇదీ చదవండి:బ్యాడ్​ బ్యాంక్​తో ఎన్​పీఏ సమస్యకు చెక్​!

ABOUT THE AUTHOR

...view details