తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 12:35 PM IST

ETV Bharat / business

బ్యాంక్​ లోన్​ ఈఎంఐ ఆలస్యమైందా? అయినా ఫర్వాలేదు!

బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కలిగించే దిశగా ఆర్బీఐ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపు ఆలస్యమైనా అనుమతిచ్చే విధంగా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

loan repayment delay is ok
రుణాల చెల్లింపు ఆలస్యమైన ఫర్వాలేదు

రుణ వాయిదాల చెల్లింపులపై వినియోగదారులకు ఆర్బీఐ ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే రుణ వాయిదాలు, ఇతర చెల్లింపులను ఆలస్యమైనా బ్యాంకులు అనుమతించేలా ఆర్బీఐ ఆదేశాలిచ్చే ఆవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

'లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారులు, ఇతర వ్యక్తుల ఆదాయ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా రుణాలు, నెలవారీ వాయిదాలు ఆలస్యమైనా చెల్లింపునకు అనుమతివ్వాలనే డిమాండు ఇటీవల పెరిగిపోయింది. ఇప్పటికే ఈ అంశంపై భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) చర్చలు జరిపింది. ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో ఉంది.' అని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు.

అర్బీఐ ఇందుకు అంగీకరిస్తే ప్రస్తుతం సంక్షోభ సమయంలో వ్యాపార, వ్యక్తి గత రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుంది.

ఇప్పటికే పలు ఉద్దీపనలు..

కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకు వినియోగదారులకు ఊరటనిచ్చే చర్యలు తీసుకున్నారు.

ఏ బ్యాంకు ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకున్నా ఛార్జీలు ఉండవని తెలిపారు. బ్యాంకుల్లో కనీస నిల్వ నిబంధనను తొలిగించారు. జూన్‌ వరకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'కరోనాతో విమానయాన రంగానికి ఈ ఏడాది భారీ నష్టం'

ABOUT THE AUTHOR

...view details