తెలంగాణ

telangana

ETV Bharat / business

'మిస్త్రీ కేసు'పై సుప్రీంను ఆశ్రయించిన రతన్ ​టాటా - ఎన్​సీఎల్​ఏటీ తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంలో రతన్​టాటా పిటిషన్​

'సైరస్​ మిస్త్రీ' కేసు విషయంలో కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ రతన్​ టాటా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్​సీఎల్​ఏటీ తీర్పు.. కేసు రికార్డులకు విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Ratan Tata moves SC against NCLAT order reinstating Mistry as Tata Sons chairman
మిస్త్రీ కేసుపై సుప్రీంను ఆశ్రయించిన రతన్ ​టాటా

By

Published : Jan 3, 2020, 6:29 PM IST

సైరస్​ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్​గా తిరిగి నియమించాలని 'కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్​ కోర్టు' ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రతన్​ టాటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పు.. కేసు రికార్డులకు విరుద్ధంగా ఉందని రతన్ పేర్కొన్నారు.

మిస్త్రీ వర్సెస్ టాటా

టాటా సన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సైరస్ మిస్త్రీని పున​ర్​నియమించాలని ఎన్​సీఎల్​ఏటీ 2019 డిసెంబర్​ 18న తీర్పునిచ్చింది. మిస్త్రీ నియామకం నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తుందని.. ఈ లోపు టాటా సన్స్​ అప్పీలుకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అప్లిలేట్ ట్రైబ్యునల్​ తీర్పును సవాల్​ చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది టాటా సన్స్.

ఆర్​ఓసీ విజ్ఞప్తిపై ఉత్తర్వులు రిజర్వ్​

సైరస్​ మిస్త్రీ కేసు తీర్పులో మార్పులు చేయాలని రిజస్ట్రీ ఆఫ్​ కంపెనీస్​ (ఆర్​ఓసీ) దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పును రిజర్వులో ఉంచింది ఎన్​సీఎల్​ఏటీ. ఈనెల 6న తీర్పు ఉండవచ్చనే సంకేతాలిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూనే రతన్​ టాటా తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి:ట్రంప్​ దెబ్బకు నింగికెగసిన పసిడి ధరలు

ABOUT THE AUTHOR

...view details