తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటాకు 'గ్లోబల్ విజనరీ' పురస్కారం - ఇజ్రాయెల్ ఇండియా

టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్​ రతన్ టాటాకు 'గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్​ బిజినెస్​ ఆండ్​​ పీస్' అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య అందజేసింది.

Ratan Tata honoured with 'Global Visionary of Sustainable Business and Peace' award
గ్లోబల్ విజనరీ పురస్కారం అందుకున్న రతన్​ టాటా

By

Published : Dec 22, 2020, 12:09 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ఇండో -ఇజ్రాయెల్​ ఛాంబర్ అఫ్​ కామర్స్ సమాఖ్య (ఎఫ్​ఐఐసీసీ) ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేసింది. శాంతి, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకుగాను 'గ్లోబల్​ విజనరీ ఆఫ్​ సస్టైనబుల్​ బిజినెస్​ ఆండ్​​ పీస్' అవార్డుతో సత్కరించింది. దుబాయ్​లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి టాటా వర్చ్యవల్​గా హాజరయ్యారు.

"ఇజ్రాయెల్​కు రతన్ టాటా అందించిన సాయం మర్చిపోలేనిది. భారత్​ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించారు. భారత్​, ఇజ్రాయెల్, యూఏఈలో ఆయనను ఎంతగానో ఆదరిస్తారు. అబ్రహమ్ అకార్డ్ తన జీవితకాలంలో సాధ్యమైనందుకు ఆయన ఎంతో సంతోషిస్తారు. భారత్​లో ఆయన నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు."

- డాక్టర్ గుల్ క్రిపాలనీ, ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్​ అధ్యక్షుడు

ఇజ్రాయెల్ భారత్​కు అవకాశాల గని

ఇజ్రాయెల్ వంటి దేశంతో భాగమవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రతన్ టాటా అన్నారు. భారత్​కు ఈ దేశం అవకాశాల గని అని తాను చాలా సందర్భాల్లో పేర్కొన్నానన్నారు.

"భారత్, ఇజ్రాయెల్, మధ్య ఆసియా దేశాలు కలవడం మంచి భవిష్యత్తుకు పునాది. ఈ దేశాల మధ్య ఇలా సమాఖ్యలు ఉండటం లాభదాయకమేనని భావిస్తాను. నిజానికి ఇది కొన్ని ఏళ్ల ముందే జరగాల్సింది."

-రతన్ టాటా, గ్లోబల్ విజినరీ పురస్కార గ్రహిత.

ఇదీ సంగతి :ధరల పెంపు బాటలో వాహన తయారీ సంస్థలు

ABOUT THE AUTHOR

...view details