వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాలను వెంటనే ఉపసంహరించుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కేంద్రం కఠిన నింబంధనలు విధించేలా చూడాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) సుప్రీంకోర్టును కోరింది.
కేంద్రం విఫలం..
భారతదేశంలో వాట్సాప్ కార్యకలాపాలకు కేంద్రం అనుమతినిచ్చిందని.. అయితే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో విఫలమైందని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్రం తన రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు ఈ వ్యాజ్యం అత్యవసరమని భావిస్తున్నట్టు న్యాయవాది వివేక్ నారాయణ్ శర్మ తెలిపారు.