తెలంగాణ

telangana

ETV Bharat / business

రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్​- భారీగా తగ్గనున్న పెట్రోల్​ ధర

ఇటీవల కాలంలో భారీ పెరిగిన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. లీటర్​ పెట్రోల్ ధర సుమారు మూడు రూపాయిల వరకు తగ్గనుంది. ఈ మేరకు తమిళనాడు ఆర్థికమంత్రి పెట్రోల్​ పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

By

Published : Aug 13, 2021, 2:36 PM IST

Updated : Aug 13, 2021, 3:25 PM IST

petrol,TN
పెట్రోల్, తమిళనాడు

ఆకాశాన్ని అంటిన ఇంధన ధరల భారం నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. లీటరు పెట్రోల్​పై సుమారు 3 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

"లీటరుకు పెట్రోల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రజలకు కొంతమేర ఉపశమనం కలగనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.1,160 కోట్ల మేర భారం పడనుంది."

-పి. త్యాగరాజన్, తమిళనాడు ఆర్థిక మంత్రి

అయితే తగ్గించిన ఈ పెట్రోల్ ధరలు ద్విచక్ర వాహనదారులకు మాత్రమే వర్తిస్తాయని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మే నుంచి ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అన్ని మెట్రోనగరాల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.49 ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 94.39గా ఉంది.

ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి:స్వల్పంగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

Last Updated : Aug 13, 2021, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details