దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గురువారం దిల్లీలో లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 15 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి రూ.107.60 కు చేరగా.. డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.97.51గా ఉంది.
- కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరిగి రూ.101.80గా ఉంది. డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ.93.08కు చేరింది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ. 102.28కు చేరింది. డీజిల్ ధర 14 పైసలు పెరిగి రూ.94.44గా ఉంది.