దేశవ్యాప్తంగా ఆదివారం చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోనే 14 సార్లు పెరిగిన ధరలు.. వరుసగా 12రోజులపాటు(ఈనెల 20వరకు) అంతకంతకూ వృద్ధి చెందాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 24 సార్లు పెరిగిన చమురు ధరలు.. మొత్తంగా రూ.7.50 వృద్ధి చెందాయి.
ఎట్టకేలకు పెట్రో బాదుడుకు బ్రేకులు - Petrol Rates in India
దేశంలో వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రోల్ ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ లీటరు రూ. 80.97గా ఉంది.
12 రోజుల తర్వాత శాంతించిన చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధరల్లో మార్పులు, డాలురుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల వల్లే ఇంధన రేట్లు పెరిగాయి. ప్రస్తుతం.. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58గానూ.. లీటరు డీజిల్ రేటు రూ. 80.97గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90పైనే కొనసాగుతోంది.
ఇదీ చదవండి:'ధరలు తగ్గించాలని తప్ప మరేం చెప్పలేం'