తెలంగాణ

telangana

ETV Bharat / business

80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు - దేశంలో లీటర్ పెట్రోల్ ధర

లాక్​డౌన్ సడలింపులతో పెరిగిన డిమాండ్​కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్​ ధరలను స్వల్పంగా పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. గడిచిన 80 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మార్చడం ఇదే ప్రథమం. తాజా సవరణతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి...

Petrol, diesel price increased
పెట్రోల్, డీజిల్ ధరల్లో వృద్ధి

By

Published : Jun 7, 2020, 2:04 PM IST

దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ సడలింపులకు తోడు ముడి చమురు ధర బ్యారెల్​కు 40 డాలర్లపైకి చేరిన నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 60 పైసలు ధర పెంచాయి. చివరి సారిగా మార్చి 16న దేశీయంగా ధరలు సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్​ పెంచడం వల్ల గడిచిన 80 రోజుల్లో పలు మార్లు పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగాయి.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు​) ఇలా..

నగరం పెట్రోల్ డీజిల్
దిల్లీ రూ.71.86 రూ.69.99
హైదరాబాద్​ రూ.74.61 రూ.68.42
బెంగళూరు రూ.74.18 రూ.66.54
ముంబయి రూ.78.3 రూ.68.20
చెన్నై రూ.76.07 రూ.68.74
కోల్​కతా రూ.73.28 రూ.65.61

ఇదీ చూడండి:జియో యూజర్లకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details