దేశవ్యాప్తంగా వరుసగా రెండోరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. శనివారం లీటరు పెట్రోల్ పై 15పైసలు, డీజిల్పై 20పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 81.23 నుంచి 81.38కు పెరిగింది. డీజిల్ రేటు లీటరుకు రూ.70.68నుంచి 70.88కు ఎగబాకింది.
వరుసగా రెండోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు - petro rates hiked in india news
దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 15పైసలు, డీజిల్పై 20పైసలు పెంచాయి చమురు సంస్థలు.

వరుసగా రెండోరోజు పెట్రో మంట
ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.87.92నుంచి 88.09కు పెరిగింది. డీజిల్ ధర 77.11నుంచి 77.34గా ఉంది. వ్యాట్ను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది.
ఇదీ చదవండి :మళ్లీ పెట్రో వాత.. లీటరుపై 11 పైసలు పెంపు
Last Updated : Nov 21, 2020, 6:34 PM IST