దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్పై(petrol price)22 పైసలు, డీజిల్పై 29 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.94.23కి చేరింది. డీజల్ ధర(diesel price) రూ.85.15గా ఉంది.
petrol price: మే నెలలో 16వ సారి పెట్రో బాదుడు - diesel price in india
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్(petrol price)పై 22 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్కు రూ.94.23కి చేరింది. ఒక్క మే నెలలోనే 16 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.

పెట్రోల్ ధరలు
మే నెలలో చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి కావడం గమనార్హం. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్పై(petrol price) రూ.3.83, డీజిల్పై రూ.4.42 పెంచాయి సంస్థలు. మరో వైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ముంబయిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100.47, రూ.92.45గా ఉన్నాయి.
ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!