కరోనా వైరస్పై పోరులో భారత దేశం ఐకమత్యంతో ముందుకు సాగుతోంది. వైద్యులు, నర్సులతో పాటు వివిధ విభాగాలకు చెందిన వారు.. తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశం కోసం పోరాడుతున్నారు. వారిలో ఇండియన్ ఆయిల్ కార్ప్(ఐఓసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ ఒకరు. తన తండ్రిని కోల్పోయిన 24 గంటల్లోనే తిరిగి పనిలో పడ్డారు ఆయన.
చమురు కొరత రాకుండా...
దేశంలోనే అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్ప్లో సంజీవ్ సింగ్ రిఫైనరీ ఆపరేషన్స్తో పాటు సరఫరానూ పర్యవేక్షిస్తున్నారు. వైరస్పై యుద్ధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన రోజే(మార్చి 24) సింగ్ తండ్రి(89 ఏళ్లు) కన్నుమూశారు. అది జరిగిన 24 గంటల్లోనే పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టి.. దేశంలో ఎక్కడా చమురు కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంజీవ్. ఇందుకోసం ఆయన తల్లిదండ్రుల నివాసాన్నే ఓ వార్ రూమ్గా మార్చుకుని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాలనూ పర్యవేక్షిస్తున్నారు.