దేశంలో వాహనాల అమ్మకాలు కరోనా సంక్షోభం నుంచి తేరుకుని క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.92 శాతం పెరిగి.. 2,81,380 యూనిట్లుగా నమోదైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది. 2020 ఫిబ్రవరిలో 2,38,622 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపింది.
సియామ్ గణాంకాలు ఇలా..
గత నెల ద్విచక్ర వాహన విక్రయాలు 10.2 శాతం పెరిగి.. 14,26,865 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12,94,787గా ఉంది.