బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితి పెంచే.. 1938 ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. గత వారం రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలుపగా.. తాజాగా లోక్ సభలోనూ ఆమోద ముద్ర పడింది.
బీమా రంగంలో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న ఎఫ్డీఐల పరిమితిని 74 శాతానికి పెంచుతూ ఈ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.