తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 11:57 AM IST

ETV Bharat / business

'ఎస్​ బ్యాంక్ పునరుద్ధరణ పథకాన్ని విశ్లేషిస్తున్నాం'

ఎస్​ బ్యాంకు డిపాజిటర్లకు తమ డబ్బు విషయంలో భయం అక్కర్లేదని ఎస్​బీఐ ఛైర్మన్​ రజనీశ్​ కుమార్​ హామీ ఇచ్చారు. ఎస్​ బ్యాంకులో 49 శాతం వాటా కొనేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశామని.. అందుకు తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్​బీఐకి సోమవారం నివేదిస్తామని తెలిపారు.

sbi
ఎస్​బీఐ

ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం ముసాయిదాను స్వీకరించామని ఎస్​బీఐ ఛైర్మన్​ రజనీశ్​ కుమార్​ తెలిపారు. ముసాయిదాకు తగిన విధంగా బ్యాంకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పునరుద్ధరణ పథకాన్ని పరిశీలించిన చాలా మంది సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులు ఎస్​బీఐని సంప్రదిస్తున్నట్లు రజనీశ్​ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు.

"మాకు ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం ముసాయిదా అందింది. మా పెట్టుబడులు, న్యాయనిపుణుల బృందాలు దానిపై కృషి చేస్తున్నాయి. ఎస్​ బ్యాంకులో 49 శాతం వాటాలు కొనేందుకు అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నాయి. ఈ విషయమై స్టాక్ ఎక్స్ఛేంజికి సమాచారం ఇచ్చాం. తమ డబ్బు విషయంలో డిపాజిటర్లకు ఎలాంటి భయం అక్కర్లేదు. "

- రజనీశ్ కుమార్​, ఎస్​బీఐ ఛైర్మన్​

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి మార్చి 9న ఆర్​బీఐకి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని రజనీశ్ స్పష్టం చేశారు.

ఇదీ పునర్నిర్మాణ పథకం..

ఎస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పునరుద్ధరణ పథకం- 2020 ముసాయిదాను ఆర్‌బీఐ శుక్రవారంప్రకటించింది. దాని ప్రకారం.. వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్యాంకు 49 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. రూ.10 తక్కువకు కాకుండా షేరును కొనాల్సి ఉంటుంది. ప్రీమియం రూ.8 వరకు ఉండొచ్చని ఆ ముసాయిదాలో తెలిపింది.

మూలధనం వచ్చిన తేదీ నుంచి మూడేళ్ల లోపు ఆ వాటా 26 శాతంలోపు చేరడానికి వీలులేదు. అదే సమయంలో బ్యాంకు అధీకృత మూలధనం రూ.5,000 కోట్లుగా ఉంటుంది. రూ.2 ముఖ విలువ గల 2400 కోట్ల ఈక్విటీ షేర్లుంటాయి. ఈ ముసాయిదాపై అందరి అభిప్రాయాలను మార్చి 9 వరకు స్వీకరిస్తారు.

ఇదీ చూడండి:'దివాలా స్మృతితో మారిన ఆలోచనలు-పెరిగిన రుణ వసూళ్లు'

ABOUT THE AUTHOR

...view details