తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 5:15 PM IST

ETV Bharat / business

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్​ను ప్రముఖ ఒలెక్ట్రా గ్రీన్ కంపెనీ అందుకుంది. వీటిని ఏడాది కాలంలో సరఫరా చేసేందుకు ఒలెక్ట్రా ఒప్పందం కుదుర్చుకుంది.

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరొందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్​ను అందుకుంది. పూణే మహానగర్ పరివాహన్ మండల్ లిమిటెడ్.. ఈ బస్సులను ఆర్డర్ చేయగా... వీటిని ఏడాది కాలంలో సరఫరా చేసేందుకు ఒలెక్ట్రా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన 150 ఎలక్ట్రిక్ బస్సులను పూణేలో ఏవీ ట్రాన్స్ నడుపుతుండగా.. ఈ కొత్త బస్సుల చేరికతో వీటి సంఖ్య 300కు చేరుకుంటుందని కంపెనీ సీఈవో శరత్ చంద్ర హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:జనవరి నుంచి వచ్చే మార్పులివీ...

ABOUT THE AUTHOR

...view details