దేశంలో 14 శాతం కుటుంబాలు మాత్రమే విద్యుత్ ఆదా చేసే 5 లేదా 4 స్టార్ ఏసీలను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ఈ సర్వే నిర్వహించాయి.
ఇందులో టైర్-2 పట్టణాల్లో 93 శాతం మంది కుటుంబాలకు స్టార్ లేబులింగ్ విధానం గురించి అవగాహన ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ..14 శాతం మాత్రమే 5 లేదా 4 స్టార్ ఏసీలను కొనుగోలు చేశారని తేలింది. 75 శాతం మంది ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేయాలనుకున్నా.. వారిని అధిక ధరలు ప్రధానంగా అడ్డుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.
ఈ నివేదిక ఆధారంగా ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ (ఆర్సీటీ) ప్రయోగాల ద్వారా ఎక్కువ రేటింగ్ ఉన్న విక్రయాలు పెరిగేందుకు పలు సూచనలు చేశారు విశ్లేషకులు. జీఎస్టీ 28 శాతం నుంచి 5 శాతం కన్నా దిగువకు తగ్గించడం ద్వారా.. తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలతో పోటీగా 5 లేదా 4 స్టార్ ఏసీల విక్రయాలు పెరుగుతాయని అభిప్రాయయం వక్తం చేశారు.
ధన్బాద్, మదురై, మీరఠ్, వడోదర పట్టణాల్లో.. 400లకుపైగా కుటుంబాలపై ఈ అధ్యయనాలు జరిగాయి.