తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓలా 'ఈ-స్కూటర్లు' వచ్చేస్తున్నాయ్​! - ఓలా 2021

భారత్​కు చెందిన ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఓలా.. ఈ స్కూటర్ల అమ్మకాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. 2021 జనవరి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. తొలి ఏడాదిలోనే 10లక్షల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది ఓలా.

Ola to introduce e-scooter by Jan next year: Sources
2021 జనవరి నుంచి ఓలాలో ఈ-స్కూటర్ల అమ్మకాలు!

By

Published : Nov 20, 2020, 6:38 AM IST

ప్రముఖ ఆన్​లైన్ క్యాబ్​ సేవల సంస్థ ఓలా.. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ-స్కూటర్​లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెదర్లాండ్స్​లో తయారైన ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​లను భారత్​తో పాటు ఐరోపా దేశాల్లో అమ్మకాలు నిర్వహించనున్నట్టు సమాచారం.

ఈ ఏడాది మేలో ఆమ్​స్టర్​డామ్​- ఎటర్గో బీవీని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ క్యాబ్​ సేవల సంస్థ. ఆ సమయంలోనే.. 2021లో దేశంలో ఎలక్ట్రిక్​ ద్విచక్రవాహనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.

అయితే.. ధరలు మాత్రం ప్రస్తుత పెట్రోల్ స్కూటర్లకు పోటీగా ఉండే అవకాశమున్నట్టు సమాచారం. తొలి ఏడాదిలో.. సుమారు 10లక్షల ఈ-స్కూటర్ల అమ్మకాలకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:వర్క్​ ఫ్రం హోం ఇచ్చినా.. ఆఫీస్​ల లీజులు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details