తెలంగాణ

telangana

ETV Bharat / business

జూన్‌ 7 నుంచి కొత్త ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ - మొబైల్​లో ఉపయోగించుకునేలా ఐటీశాఖ వెబ్​సైట్

ఇకపై ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభంకానుంది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకించి ఓ వెబ్​సైట్​ను రూపొందించింది. దీనితో మొబైల్​ ఫోన్​లో నుంచి కూడా ఇ-ఫైలింగ్​ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

e-filing portal, IT Dept
tax, it, income tax

By

Published : May 30, 2021, 8:05 AM IST

ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేయడంతోపాటు, మొబైల్‌ ఫోనులోనూ ఉపయోగించుకునేలా ఇ-ఫైలింగ్‌ 2.0 కొత్త పోర్టల్‌ రానుంది. ఇప్పటి వరకూ ఉన్న వెబ్‌సైటు స్థానంలో జూన్‌ 7 నుంచి http:///incometax.gov.in అందుబాటులోకి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

ఇందులో ముందుగానే పూర్తి చేసిన ఐటీ ఫారాలు ఉంటాయి. ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్‌లో కొత్త మొబైల్‌ యాప్‌ కూడా ఉండబోతోంది. ఇందులో రిటర్నులను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు, ఇతర సమాచారమూ ఉంటుందని పేర్కొంది. జూన్‌ 1 నుంచి 6 వరకూ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌లో వెల్లడించింది.

ఇదీ చూడండి:వాటిపై జీఎస్​టీ మినహాయింపునకు కేంద్ర బృందం ఏర్పాటు!

ABOUT THE AUTHOR

...view details