విద్యుత్ రంగంలో ఇప్పటి వరకు 1000 మంది కరోనాతో మృతి చెందారని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) శుక్రవారం ప్రకటించింది. మొత్తం 15 వేలకుపైగా సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పేర్కొంది.
మహారాష్ట్రలో అత్యధికం..
మహారాష్ట్రలో అత్యధికంగా 210 మంది విద్యుత్ రంగ ఉద్యోగులు కరోనాతో మృతి చెందగా.. 7,100 మందికి పాజిటివ్గా తేలింది. ఉత్తర్ప్రదేశ్లో 4 వేల మందికి కరోనా సోకగా.. 140 మంది మహమ్మారికి బలయ్యారు.
ప్రధానికి లేఖ..
కేసులు, మృతులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ రంగ ఉద్యోగులకు టీకా ప్రక్రియలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్ కె సింగ్కు లేఖ రాసింది ఏఐపీఈఎఫ్.
దీనితో పాటు కరోనా వల్ల మృతి చెందిన విద్యుత్ రంగ ఉద్యోగులందరికీ రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ వంటి సంస్థలు ఇప్పటికే వారి ఉద్యోగుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి:2020-21లో డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,952 కోట్లు